బాలికలు ఉపయోగించే నాప్కిన్ కిడ్స్పేట్ జీఎస్టీ ఎత్తివేయాలి, పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ చార్జీలు ఇవ్వాలి, బాలికలకు శానిటరీ నాప్కిన్ ఉచ్చితంగా ఇవ్వాలి -ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్
మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట, బాలికలు ఉపయోగించే నాప్కిన్ కిట్స పై జీఎస్టీని ఎత్తి వేయాలి, ఉచితంగా సంక్షేమ హాస్టల్లో పంపిణీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. కనీసం విద్యార్థికి 2000 రూపాయలు మెస్ ఛార్జీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు అన్నం తినలేక చెత్తబుట్టలో పడేసే పరిస్థితి ఉందని అన్నారు. బాలికలకు నాప్కిన్ కిట్స ఉచితంగా ప్రతి హాస్టల్లో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 3568 స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నారు. పాఠశాలలో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పాఠశాల కమిటీ హేమంత్, సంతోష్, పవన్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: