CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళితుల అభ్యున్నత కోసమే దళిత బంధు : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


గుండాల , సెప్టెంబర్ 10(మన్యం మనుగడ) : దళితుల అభ్యున్నత కోసమే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చారని ప్రభుత్వ విన్నపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం మణుగూరులో జరిగిన దళిత బంధు సమావేశంలో గుండాల మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు 50 మంది మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు ఆధ్వర్యంలో రేగా సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేగామాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలతో దళిత బంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందన్నారు. దళితులకు అండగా నిలుస్తూ వారి అభ్యున్నతకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గంలోని దళితులంతా అండగా నిలవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, పార్టీ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, వట్టం రవి,         పొంబోయిన సుధాకర్, సుభాని, బొమ్మెర శ్రీను, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: