మన్యం మనుగడ వాజేడు. : ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి మళ్ళీ మొదలయ్యింది. చర్ల మండలంలో ఆదివాసి ఉప సర్పంచ్ ని మావోయిస్టు దారుణంగా హత్య చేశారు. ఏజెన్సీలో పలు గ్రామాలలో వాల్ పోస్టర్లు వేశారు. వాటిని పరిగణలోకి తీసుకున్న పోలీస్ శాఖ పై అధికారులు సమాచారం మేరకు ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలంలో నూట అరవై మూడో వ జాతీయ రహదారి పై ఎస్సై తిరుపతిరావు, సిఆర్పిఎఫ్ బెటాలియన్ తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రహదారి పై వెళ్లే వాహనాలకు లైసెన్సులు లేని వాహనాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు, ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ లేకపోతే ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే హెల్మెట్ కచ్చితంగా ధరించాలని అన్నారు.
Post A Comment: