CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

న్యాయ పరమైన డిమాండ్స్ నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తాం

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 61 వ రోజుకు చేరుకుంది. ఇట్టి కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అయిన కర్రి. నాగార్జున్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ ల పట్ల చాలా హేయమైన ధోరణి ఆవలంబిస్తోందని, వీఆర్ఏ ల వివరాలను మరియు వారి బంధువుల వివరాలను పోలీస్ కమీషనరేట్ ద్వారా తెలుసుకొని వారిని బెదిరింపు చర్యలకు పాల్పడాలని చూస్తున్నారని అన్నారు. వీఆర్ఏ లు రోడ్ల మీద ధర్నాలు చేసిన వారిని అరెస్టు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు నోటీసులు ఇచ్చారు. వీఆర్ఏల కు మాట ఇచ్చి ఎన్ని సార్లు తప్పుతారని, వీఆర్ఏ ల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపు చర్యలకు భయపడేది లేదని అవసరం అయితే సమ్మెను మరింత ఉదృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు చెప్పడతామని అన్నారు.

            ఈ కార్యక్రమంలో వీఆర్ ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: