మన్యం మనుగడ, దమ్మపేట: ఫామ్ ఆయిల్ మొక్కలు సాగుకు డిమాండ్ పెరగడంతో కొందరు అక్రమార్కులు కాసులకి కకృతి పడుతూ నాసిరకం మొక్కలు పెంచి రైతులు కష్టాన్ని దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో ముష్టిబండ నుండి వడ్ల గూడెం వెళ్లే దారిలో ఫామాయిల్ తోటలో అక్రమ పద్ధతిలో పామాయిల్ మొక్కలు పెంచుతున్న గుర్రాల కోటేశ్వరరావు అనే రైతు ఈవిధంగా ఆ తోటలోని గింజలతో మొక్కలు పెంచి రైతులను మోసం చేస్తున్నారు. ఈ మొక్కలను అయిదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై కొందరు రైతులు హార్టికల్చర్ ఎచ్ఓ కి సమాచనరము ఇచ్చారు. దీనిపై హార్టికల్చర్ ఎచ్ఓ స్పందిస్తూ వీళ్ళు పెంచుతున్న మొక్కలు అక్రమ పద్ధతుల్లో పెంచుతున్న మొక్కలని సూచించారు. ఈ మొక్కలు వ్యవసాయానికి పనికిరాని మొక్కలని అలాగే రైతులు ఇలాంటి మొక్కలను నమ్మవద్దని రైతులు ఇలాంటి దళారీలను కూడా నమ్మవద్దని సూచించారు దీనిపై పోలీసు శాఖవారికి సమాచారం ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని ఎచ్ఓ తెలియజేశారు.
Navigation
Post A Comment: