మన్యం మనుగడ,పినపాక:
పినపాక మండల తహశీల్దార్ విక్రమ్ కుమార్ తన ఔదార్యాన్ని మరో మారు చాటుకున్నారు. ఎల్లప్పుడు సాయానికి ముందుండే ఆయన, తహసిల్దార్ కార్యాలయంలో కిందిస్థాయి ఉద్యోగులైన వీఆర్ఏ లు గత కొన్ని రోజులుగా పే స్కేల్ వేతనంతో కూడిన ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సమ్మె చేస్తున్న విషయం అందరికీ విధితమే. కార్యాలయంలో పని చేయక, ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్న వారిని, పినపాక తహసిల్దార్ విక్రమ్ కుమార్ రూపంలో సాయం అందింది. 22 మంది వీఆర్ఏలకు నిత్యవసర సరుకులు, 25 కేజీల బియ్యం ను పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. కిందిస్థాయి ఉద్యోగులను పని పేరుతో చిత్రహింసలకు గురి చేసే అధికారులు ఉన్న ఈ రోజులలో, దసరా పండుగ సందర్భంగా వారికి సాయం అందించిన తహసిల్దార్ విక్రమ్ కుమార్ గురించి పలువురు మాట్లాడుకుంటూ, అభినందించారు.
Post A Comment: