మన్యం మనగడ , కరకగూడెం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదలకు వరంలా మారిందని కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు రఘునాథపాలెం గ్రామానికి చెందిన జాడి.రవి కి రూపాయలు 20500 పద్మాపురం గ్రామానికి చెందిన రషీద్ కి 12,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతు హాస్పటల్ పాలైన ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, హాస్పటల్ కు వెళ్లడానికి ఖర్చు అయ్యే ఎల్వోసి లను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు లబ్ధి పొందేలా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడగం.రాము,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం నరసింహారావు,సర్పంచ్ లు కొమరం.విశ్వనాధం,పోలెబోయిన.నరసింహరావు,పోలెబోయిన పాపమ్మ,భూక్య.భాగ్యలక్ష్మి ఉపాధ్యక్షులు పోగు. వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం.రాజబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్టా. ఏడుకొండలు,ఆత్మ కమిటీ అధ్యక్షులు కొంపెల్లి. పెదరామలింగం,పిఎసిఎస్ డైరెక్టర్ రావుల కనకయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిరంజీవి టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గుడ్ల. రంజిత్ కుమార్ ,సిద్ది.సునీల్ కంటేం.నాగేష్, రామకృష్ణ,యువజన నాయకులు నిట్టా. ప్రభాకర్, షోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: