- ఇసుక దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు
- మూడు లారీలు, ఒక జేసిబి స్వాధీనం...
- పినపాక తహాసిల్దార్ విక్రమ్ కుమార్...
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం పెదవాగులో అక్రమంగా జీరో దందాకు అలవాటు పడి ఇసుకను దొంగిలిస్తున్న మూడు లారీలను, ఒక జెసిబిని స్వాధీనపరచుకొని జరిమానా విధించామని, పినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్ తెలియజేశారు. మంగళవారం తెల్లవారుజామున ఇసుక దొంగలు పెద్దవాగులో చొరబడి లారీలలో ఇసుకను ఎత్తుకొని పారిపోతున్న సమయంలో గ్రామస్తుల సహకారంతో ఇసుక లారీలను ఆపివేసి సీజ్ చేసి, జరిమానా విధించామని తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకొని ఇసుక ర్యాంప్ నిర్వహించుకోవాలని, దొంగతనాలకు పాల్పడి రాత్రిపూట ఇసుకను దొంగిలించి ఇతర ప్రాంతాలకు చేరవేయడం నేరమని ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment: