CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోతులు దాడులకు భయపడుతున్న గ్రామస్తులు....... వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన యువకులు.........

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి , చండ్రుగొండ :  కోతులు గ్రామంలో వీర విహారం చేస్తూ గ్రామంలో వృద్ధులపై చిన్నారులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నాయని కోతుల బెడద నుంచి మమ్మల్ని కాపాడండి  అంటూ గ్రామస్తులు భారీ ఎత్తున నిరసనకు దిగిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది.. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో కొన్ని నెలలుగా కోతులు బెడద ఎక్కువైందని  ప్రతిరోజు ఏదో ఒక చోట కోతులు వృద్ధులుపై, చిన్నారులుపై, దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయన్నారు. ఎవరు లేని ఇండ్లలోకి దూరి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తున్నాయన్నారు. ఇండ్లలో ఉన్న వారిపై ఒక్కసారిగా గుంపులు గుంపులుగా మీద పడి దాడులు చేస్తున్నాయని.  అలాగే పంట పొలాలను కూడా సర్వనాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు పాలకవర్గానికి ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు. సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి కార్యాలయంలోకి అధికారులను, సిబ్బందిని, వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే ఆర్ అండ్ బి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి రావికంపాడు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యేలా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని తెలపడంతో గ్రామస్తులు, నిరసనకారులు శాంతించి నిరసన విరమించారు.

Share it:

TELANGANA

Post A Comment: