మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం కోమటిపల్లి గ్రామం లో నిర్వహించిన సమావేశం లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనత పార్టీ లో కోమటపల్లి గ్రామం నుండి ఎవరు చేరలేదు అని కోమటపల్లి గ్రామ అధ్యక్షుడు సర్దన నర్సయ్య తెలియజేశారు.ఇటీవల కొంతమంది అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. మంగపేట మండల కోమటపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు భారతీయ జనతా పార్టీలో చేరారు అని 17 వ తరికు న ప్రకటన చేశారు ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కోమటపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఇప్పుడు, ఎప్పుడు తల్లి లాంటి పార్టీ కి ద్రోహం చేయమని కష్ట కాలం లో బలోపేతానికి కృషి చేస్తాం కానీ, ద్రోహం చేయమని కాంగ్రెస్ పార్టీని వీడేదే లేదని మాకు అన్ని విధాలా ములుగు ఎమ్మెల్యే మా ఆడబిడ్డ సీతక్క, అన్ని విధాలుగా అండగా ఉంటూ మాతో మమేకమై నిత్యం ప్రజల మధ్య లో ఉంటున్న ఒక ఆదివాసీ ఎమ్మెల్యే పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మమ్మల్ని బలవంతంగా బీజేపీ టవల్ వేసి ఫొటో తీసుకున్నారు అని కొంతమంది ఆ కార్యక్రమంలో లేకున్నా వారి పేర్లు ప్రకటన లో చేర్చి వాల్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు బీజేపీ లో ఎవరు చేరలేదు, ఆ యొక్క ప్రకటన కు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మసిరెడ్డి వెంకట్ రెడ్డి,కారుపోతుల నర్సయ్య, సర్దన నర్సయ్య, గోడ్డే జగన్, ప్రశాంత్,వట్టం సంతోష్, రాజు,గణపురం హరీష్ రావులకొలను ఉపేందర్ తాటి రాములు వట్టం సునీల్ మద్దిరాల భిక్షపతి గొప్పేనపల్లి కిరణ్ తాటి రమేష్ తునికి యకయ్య పొందేం లింగయ్య తదితరులు హాజరయ్యారు.
Post A Comment: