*వామక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన నిర్మించాలి
: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్.
*మన్యం మనుగడ ఏటూరు నాగారం*
మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సాంబశివ మాట్లాడుతూ.దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దేశంలో ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుకూలంగా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు ముఖ్యంగా ఆధానీ, అంబానికి దేశ సంపద ను ప్రభుత్వం కారు చౌకగా అప్పచెప్పుతున్నదని పేర్కొన్నారు.నేడు ప్రపంచంలో అతి పెద్ద సంపన్నులలో ఆదాని 10 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడని పేర్కొన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. దేశంలో పరోక్ష పన్ను లు పెంచి పెట్రోల్,గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజలను దోసుకుంటున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేస్తూ ఆ వాగ్దానం అమలు చేయకుండా దాటవేస్తుందని ఉదాహరణకు రైతుల రుణమాఫీ,దళిత బంధు డబుల్ బెడ్ రూములు,ఏ స్కీం పెట్టిన నామ మా త్రంగా అమలు చేసి ప్రజల్ని మోసం చేస్తుందని అన్నారు.గ్రామ గ్రామాన ప్రజా సమస్య లు అధ్యయనం చేసి పెద్ద ఎత్తున ప్రజలను ఆందోళన పోరాటలకు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి,ఎండి దావూద్ ఏటూర్ నాగారం మండల కార్యదర్శి దబ్బగట్ల లక్ష్మయ్య రత్నం రాజేందర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,జిల్లా కమిటీ సభ్యులు వంక రాములు, కుమ్మరి శ్రీను,కొప్పుల రఘుపతి,పొదిళ్ల చిట్టిబాబు,తీగల ఆదిరెడ్డి ఎండిగపూర్ పాష,కావేరి సుధాకర్,దుగ్గి చిరంజీవి తదితులు పాల్గొన్నారు.
Post A Comment: