CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దుమ్ముగూడెం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి..

Share it:

 


  • దుమ్ముగూడెం వద్ద క్రమంగా  పెరుగుతున్న గోదావరి.. 
  • జాతీయ ప్రధాన రహదారిపై వరదనీరు నిలిచిపోయిన రాకపోకలు.. 
  • రెండు నెలల వ్యవధి లో నాలుగు సార్లు 50 అడుగులు దాటిన గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు..

మన్యం టీవీ, దుమ్ముగూడెం ::

గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహిస్తుండటంతో మండల పరిధిలోని పర్ణశాల దుమ్ముగూడెం గ్రామాల వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది దుమ్ముగూడెం హెడ్ లాక్స్ వద్ద 26 అడుగులు భద్రాచలం వద్ద 51 అడుగులు దాటి ప్రవహిస్తునడంతో మండలంలోని పరివాహ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు తూరుబాకా గ్రామం వద్ద జాతీయ రహదారిపై వరదనీరు  రావడంతో భద్రాచలం టు చర్ల రాకపోకలు నిలిచిపోయాయి పర్ణశాల పుష్కర ఘాటు వద్ద వరద ప్రభావం కొనసాగుతుంది సీతమ్మ వారి నార చీరల ప్రదేశం మొత్తం నీట మునిగింది పర్ణశాలలోని వెళ్లే రహదారిపై నీరు రావడంతో బారికెట్లు వేసి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి రెండు నెలల కాలంలో 50 అడుగులు నాలుగు సార్లు రావడంతో లోతట్టు ప్రాంత  ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలవరం సీతమ్మసాగర్ ప్రాజెక్టు మూలంగానే మాకు ఇంత ఇబ్బంది ఏర్పడుతుందని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి గోదావరి పరివాహ ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు అలానే సున్నంబట్టి, ఎం కాశినారం గ్రామాలలో తాసిల్దార్ చంద్రశేఖర్ పర్యటించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: