గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్3(మన్యం మనుగడ) : దసరా సెలవులలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు టి పి టీ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు అన్నారు. శనివారం మండలం పరిధిలోని రామాంజగూడెం పాఠశాలలో టిపిటిఎఫ్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈసారైనా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ కార్మికులను నియమించాలన్నారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రేమ్ సింగ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఎం రాంబాబు, ఈశ్వరి, వీరన్న, బోజ్య, భాష , రామయ్య , సురేష్ , రమేష్ , సుజాత, వీరన్న , సమ్మక్క తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: