CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని తాహశీల్దార్ కు ఏఐఎస్ఎఫ్ వినతి పత్రం.

Share it:


జూలూరుపాడు సెప్టెంబర్ 23, (మన్యం మనుగడ ప్రతినిధి) : ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశి ఆధ్వర్యంలో భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని కోరుతూ శుక్రవారం జూలూరుపాడు తహశీల్దార్ లూథర్ విల్సన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ పాత్ర కీలకమైంది అన్నారు. అలాంటి మహనీయుని జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాను, బాలాజీ, వేణు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: