మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాచలం కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేబోయిన ప్రశాంత్ యాదవ్ కి ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అవ్వడంతో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ధైర్యం చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యువజన నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: