CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం : యువజన విభాగ అధ్యక్షులు సతీష్

Share it:


గుండాల/ఆళ్లపల్లి, సెప్టెంబర్ 7, (మన్యం మనుగడ) : ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆళ్లపల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు కొమరం సతీష్ అన్నారు. బుధవారం  యువజన విభాగం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, మార్కోడ్ సర్పంచ్ కొమరం శంకర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని అన్నారు. గత ప్రభుత్వాల ఆయాములో సంక్షేమం అంటేనే ఆమడ దూరంలో ఉన్న సంగతి మనం మర్చిపోవద్దు అన్నారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రేగా నాయకత్వంలో ఆళ్లపల్లి మండలానికి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో నిలుపుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో రేగా నాయకత్వంలో పార్టీ దూసుకుపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయకులు వేమూరి రాంబాబు, కీసరి నరేష్ సందీప్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: