గుండాల/ఆళ్లపల్లి ,సెప్టెంబర్ 23(మన్యం మనుగడ)
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో ఎలుక బంధం ప్రభుత్వ పాఠశాలలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించి పిచ్చి మొక్కలను తొలగించారు, అనంతరం ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన మెరుగైన ఆరోగ్యంతో పాటు రోగాల బారిన పడకుండా ఉండవచ్చని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, సర్పంచ్ ప్రేమ కల, పిఎసిఎస్ డైరెక్టర్ సాంబశివరావు, పార్టీ నాయకులు కృష్ణ , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: