CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు కు కృతజ్ఞతలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు

Share it:


మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను పినపాక నియోజకవర్గం లోని టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సంధర్బంగా దళిత విలేకరులకు దళిత బంధు ప్రకటించడం పట్ల  టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి,ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రకటన వెలవడడం శుభపరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు వంగూరి నాగేశ్వరరావు,జిల్లా సహాయ కార్యదర్శి పిండిగవెంకట్, పినపాక నియోజకవర్గం నాయకులు పూజారి చందు, ఆంధ్ర ప్రభ ఇంఛార్జి మారుతి శ్రీనివాస్,కమిటీ సభ్యులు బర్ల జోషి,శేఖర్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: