CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు దేశానికే ఆదర్శం....దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం ప్రభుత్వ విప్ రేగా

Share it:


గుండాల సెప్టెంబర్ 1(మన్యం మనుగడ) దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతంగా నిలిపేందుకే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని అన్నారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రతిష్ట దిగజారి పోతుందని ఆయన అన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రానుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు  తెల్లం భాస్కర్, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మండల నాయకులు మోకాళ్ళ వీరస్వామి, అబ్దుల్ నబీ, వట్టం రవి, లాలయ్య, సత్యం, సుధాకర్, నగేష్ , అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: