CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : మాదిగ జేఏసీ మండల అధ్యక్షుడు ఏంపెల్లి చందర్ రావు

Share it:


మన్యం మనుగడ,, మంగపేట.:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాదిగ జేఏసీ మండల అధ్యక్షుడు ఏంపెల్లి చందర్ రావు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఎస్సీ కాలనీ యువకులతో వాగ్వాదానికి దిగిన మహిళ ఎస్సై స్రవంతి రెడ్డి వారిని కులం పేరుతో దూషించటం బాధాకరం అన్నారు.

బాధ్యతగల అధికారినిగా వ్యవహరించవలసిన ఎస్సై అన్నీ మరిచి అగ్ర కుల అహంకారంతో యువకులను కులం పేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. సదరు ఎస్సైపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుండి  తొలగించాలన్నారు. బాధ్యతాయుతమైన  పదవిలో ఉంటూ ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తూ కులం పేరుతో దూషిస్తున్న వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తేవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: