CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమంగా రాత్రి వేళలో ఇసుక తరలిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి..

Share it:


మన్యం టీవీ, దుమ్ముగూడెం ::

మండలంలోని నరసాపురం గ్రామంలో ఇసుక ర్యాంపు రాత్రి వేళలో యదేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతుంది అని  ర్యాంపు  నుండి ప్రతిరోజు మిషన్లతో లోడింగ్ చేస్తూ పదుల సంఖ్యలో లారీలతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు.దీనిలో భాగంగా  జూలై నెలలో గోదావరి వరద కారణంగా ఇసుక ర్యాంపు కూడా మునగడంతో అప్పటినుండి ప్రభుత్వ అనుమతులతో ఇసుక రవాణా ఆపేశారు. కానీ ప్రతిరోజు రాత్రి వేళలో లారీలతో ఇసుక రవాణా చేస్తూ దందా చేస్తున్నారు.రాత్రివేళ ఇసుక రవాణాతో ఇబ్బందులకు గురైన గ్రామస్తులు నిర్వాహకులను నిలదీయగా వారు దౌర్జన్యం చేయడంతో ఆదివారం రాత్రి గ్రామస్తులు ఈ విషయంపై గ్రామపంచాయతీ సర్పంచ్ కి తెలియజేయగా, గ్రామస్తులతో కలిసి సర్పంచ్ ర్యాంపు వద్దకు వెళ్లి కాంట్రాక్టర్ ని అడగగా కాంట్రాక్టర్, గుమస్తా, వారి సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సర్పంచ్ పై దాడికి దిగారని గ్రామస్తులు, సర్పంచ్ తెలియజేస్తూ సోమవారం దుమ్ముగూడెం తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది కి వినతి పత్రాన్ని అందజేశారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు..

Share it:

TELANGANA

Post A Comment: