మన్యం మనుగడ , కరకగూడెం: మండల కేంద్రంలో ఉన్న దళితులు శనివారం మణుగూరు మండల పరిధిలోని గిరిజన భవనంలో జరిగే పినపాక నియోజకవర్గం స్థాయి దళితుల సమావేశాన్ని విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమ య్య గౌడ్ దళితులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే మొదటి విడత లబ్ధి పొందిన వందమంది లబ్ధిదారులు కుటుంబ సమేతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.వారితోపాటు ప్రజాప్రతినిధులు మిగతా దళితులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Navigation
Post A Comment: