మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో పోడు రైతుల జీవితాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారికి మండల ఆదివాసీ గిరిజన ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి గిరిజన ప్రజల ఆపద్బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా కోడి అమరేందర్ మాట్లాడుతూ,పొడు భూములకు పట్టాలిస్తామని శాశ్వత పరిష్కారం చూపించామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన ఆనందం కలిగించిందని అని అన్నారు,దానితోపాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్ని తనై పోడు భూముల సమస్యలపై పోరాడిన విధానమే నేడు అనేక పోడు రైతుల జీవితాలలో వెలుగులు నింపిందని అని అన్నారు.ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృషి మరువలేనిది అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 140 విడుదల చేశారు అన్నారు,లక్షలాది ఎకరాలు సాగు చేసుకుంటున్న పోడు రైతులకు ఈ ప్రకటన ఆనందాన్ని నింపింది,పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తానన్న హామీ నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు.దేశం గర్వించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాల అమలు చేస్తున్నారని అన్నారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి నిరంతర కృషి చేస్తుంనారు అన్నారు.అదేవిధంగా అశ్వాపురం మండల గిరిజన ప్రజల తరఫున సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారు శిరస్సు వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుదిరెడ్డి సులోక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కమార్,సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు,సుది రెడ్డి గోపాలకృష్ణా రెడ్డి,చిలక నక్కనబొయెన పాపారావు, మండల ఎస్టి సెల్ కమిటీ అధ్యక్షులు కోర్స దుర్గారావు,అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు తోకల లత,సర్పంచ్ లు బండ్ల సంధ్య రాణి,పరిస్కా రాజమ్మ,గొర్రెముచ్చు వెంకటరమణ,పాయం భద్రయ్య,కాక అశోక్,మడకం సాదు,బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపేనా శ్రీను, మేడవరపు సుదీర్,సోయం శ్రీను,తాటి వెంకటేశ్వర్లు,గదే వెంకటేశ్వర్లు, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు లంకెల రమేష్,మండల యువజన ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు,బీసీ సెల్ కమిటీ అధ్యక్షులు మామిళ్ల కనీష్, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,మండల టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు కార్యకర్తలు గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: