CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు

Share it:


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏడూళ్ల బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖకు చెందిన ఉద్యోగులు విద్యార్థులకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, ఈవ్ టీజింగ్ మొదలైన దురలవాట్ల వలన కలిగే నష్టాల గురించి వివరించడం జరిగింది.చెడు స్నేహాల కారణంగా యువత దురాలవాట్లకు బానిసలు అవుతున్నారని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు చెప్పే విషయాలను విని, భవిష్యత్తులో సన్మార్గం వైపు పయనించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు. మీ గ్రామం చుట్టుపక్కల ఎవరైనా మత్తు పదార్థాల వినియోగం చేస్తున్నట్లయితే పోలీసు శాఖకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: