మన్యం మనుగడ, ఏటూరు నాగారం ;
హైదరాబాద్ లో రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజ న్ ను కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.
గిరిజన విశ్వవిద్యాలయం
అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తమిళిసై దృష్టికి తీసుకు పోవడం జరిగింది.ఎనిమిదేళ్లు గడచినప్పటికీ విశ్వవిద్యాలయం
మందుకెళ్లకపోవడంతో గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని సీతక్క అన్నారు.విశ్వవిద్యాలయం పూర్తి అయితే ఇప్పటికే పర్యాటక రంగంలో ముందున్న ములుగు ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందని ఆశభావం వ్యక్తం చేశారు.2014 రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించి నప్పటికీ తరగతులు ప్రారంభించలేదు అని ఏపీలో ఇప్పటికే ప్రారంభం కూడా అయిపోయింది.గవర్నర్ ను కలిసి ఇదే విషయం వివరించా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను వేగంగా పరిష్కరించమని
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి దారుణంగా ఉందని ములుగు గట్టమ్మ దేవాలయం ఎదురుగా భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదని విభజన హమీ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు గిరిజన విశ్వవిద్యాలయల ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఏపీలో ఇప్పటికే ప్రారంభం కాగా మన రాష్ట్రంలో దాని ప్రస్తావనే లేవనేత్తలేదని
ఇప్పటికే ములుగు పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది.గిరిజన,విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందనీ సీతక్క గవర్నర్ కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
Post A Comment: