మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన గిరిజనోద్ధరణ నాయకుడని గానుగుపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి అన్నారు. ఆదివారం రవికంపాడు పంచాయతీలో గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి మాట్లాడుతూ.... గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ఆయన పెంచిన రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో ఆమోదం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం బాధ్యులు, ప్రజా ప్రతినిధులు బొడ రాజు, ఇస్లావత్ వెంకా, భూక్య బద్రు,బాదావత్ వెంకటేష్, తేజావత్ హరీష్,ఇస్లావత్ వెంకటేశ్వర్లు, భూక్య లాలీ,కాకటి సుదర్శన్, పోతురాజు వెంకటలక్ష్మి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూపతి రమేష్,గాలం రవి,డోజర్ నరసింహారావు,నూతలపాటి కోటేశ్వరరావు, రామారావు, కెక్కర్ల వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: