CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేటలో ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించిన అటవీ క్షేత్రాధికారులు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట అటవీశాఖ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం అశ్వారావుపేట అటవీశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ అమరవీరులకు రేంజర్ అబ్దుల్ రెహమాన్ అద్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ అమరవీరులకు జోహార్లు అర్పించడం మన కనీస బాధ్యత అని అన్నారు. జాతీయ సంపదైన వనాలు, వన్య ప్రాణుల సంరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించి మెలగాలని సూచించారు. అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరు విధిగా సహకరించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, అటవీ అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి, జోహార్లు అర్పించారు. అనంతరం అటవీ క్షేత్రాధికారి కార్యాలయం నుండి రింగ్ రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్షణ ఆఫీసర్ రమేష్, అరుణ్, భద్రు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: