మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న నేను ఉన్న అంటూ ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటున్న జారే ఆదినారాయణ. తెరాస పార్టీ నుండి 2014లో అశ్వరావుపేట నియోజకవర్గం నుండి తెరాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పొందినప్పటికీ అప్పటినుండి ఇప్పటివరకు కూడా ప్రజా సమస్యలు దృష్టి సారిస్తూ, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న అడిగి తెలుసుకుంటూ ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే గుండె సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద ఉంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, మద్ది కొండ గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ నాయకులు కాసాని వెంకటేశ్వరరావుని అశ్వరావుపేట నియోజకవర్గం నాయకులు జారే ఆదినారాయణ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
Navigation
Post A Comment: