CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

Share it:



  •  మణుగూరు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ 
  • టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు,టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షబానా,టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎండి రషీద్,టౌన్ మహిళా అధ్యక్షురాలు నాంపల్లి రమణ, ఎస్సీ సెల్ నాయకులు కమ్మ కట్ల బిక్షం,పగడిపల్లి శ్యామ్ టౌన్ నాయకులు,దాసరి లీలావతి సీనియర్ నాయకులు,నాంపల్లి సాయి సోషల్ మీడియా,వల్లెపోగు ముత్తయ్య,కన్నబోయిన లాలు, కమ్మగట్ల నాగరాజు,వల్లపల్లి సాంబయ్య,కమ్మ సాయి,గారా లత,నైనారపు లక్ష్మి,వీరంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా వారందరినీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అముచేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై తమ టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తూ,ముందుకు వెళుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయి అన్నారు. పథకాలను ప్రజలను ఎంతో గాను సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమం టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోని అమలవుతున్నారని ఆయన అన్నారు.గత ప్రభుత్వాలు అభివృద్ధి గురించి ఆలోచించలేదని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని,దేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా రైతుబంధు,రైతు బీమా, కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, కెసిఆర్ కిట్టు,దళిత బంధు లాంటి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.వీటితో పాటు అనేక పథకాలు అమలవుతున్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం.నర్సింహారావు, మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పిఏసీఎస్ కుర్రి.నాగేశ్వరరావు,టిబిజికేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు, టీఆరెఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శులు రామి రెడ్డి,నవీన్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు మహిళ అధ్యక్షురాలు రమాదేవి, చంద్రకళ,పార్టీ సోషల్ మీడియా,టీఅరెస్వి నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: