మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పలు పాఠశాలలో మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో నులిపురుగు నివారణ మందులను పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులకు నులిపురుగుకు సంబంధించిన మందులను ఎంపీపీ గుమ్మడి గాంధీ స్వయంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నులిపురుగులు నివారణకు సంబంధించిన మందులు తీసుకోవడం వలన రక్తహీనత, దగ్గు ఆయాసం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదని, తెలియజేశారు. కార్యక్రమంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: