CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

Share it:

జూలూరుపాడు, సెప్టెంబర్ 24, (మన్యం మనుగడ ప్రతినిధి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని  వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల లక్ష్మణరావు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. వివరాల్లోకెళ్తే వెంగన్నపాలెం SC కాలనీకి చెందిన తంబర్ల నరసింహారావు అనే ఒక దళిత యువకుడిని, అదే గ్రామానికి చెందిన  సాయిల లక్ష్మిణరావు అనే అగ్ర కులస్తుడు  గత 06 వ తారీకు మధ్యాహ్నం సమయంలో అకారణంగా కులం పేరుతో దూషించి అవమాన పరిచాడంటూ సదరు వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు పై విచారణ చేపట్టిన పోలీసులు సాయిల లక్ష్మణరావుపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తంబర్ల నరసింహారావు మన్యం టీవీ కి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: