మన్యం మీడియా,మంగపేట:
ఏజెన్సీ ఏరియాలో ఎస్సీలకు దళిత బంధు స్కీం అమలు చేయడానికి సవాల్ చేస్తూ ఆదివాసి వెల్ఫేర్ పరిషత్ అధ్యక్షులు పి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించటం అత్యంత బాధాకరమైన చర్యని 1835 నుంచి దళితులు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులతో కలిసి సహజీవనం చేస్తున్నారని
ఏజెన్సీలో నివాసముంటున్న దళితులు ఆదివాసులతో కలిసి జీవిస్తున్నారు.
ఆదివాసులతో కలిసి బ్రతుకుతున్న దళితులు ఆదివాసులకు శత్రువులా.. మిత్రులా..
ఆదివాసులను దోచుకున్న చరిత్ర కానీ వారిపై ఆధిపత్యం చేసిన చరిత్ర గాని దళితులకు లేవని
ఆదివాసి ప్రాంతాలలో జీవిస్తున్న దళితులకు ఏజెన్సీ చట్టాల రూపకల్పంలోనే అన్యాయం జరిగింది.
ఆదివాసి సోదరులకు ఏజెన్సీ దళితుల పట్ల సానుభూతి సోదర భావం మరియు ప్రేమ కలిగి ఉండాలి తప్ప శత్రువులగా పరిగణించి ఆదివాసి చట్టాలకు వ్యతిరేక శత్రువులుగా చిత్రీకరించొద్దని తెలంగాణ మాల మహానాడు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం
Post A Comment: