మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని రైతు వేదికలో అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషణ మాస ఉత్సవాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా పినపాక సెక్టార్ పరిధిలోని గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేశారు. సెక్టార్ సూపర్వైజర్ సత్యవతి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు,ఎదుగుతున్న పిల్లలు అంగన్వాడీ అందజేస్తున్న పౌష్ఠికాహారం తీసుకోవాలని, సూచించారు.ఈ కార్యక్రమంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్, అంగన్వాడీ కార్యర్తలు ,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.
Post A Comment: