CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవాల సందర్భంగా సయ్యద్ మియాజాన్ స్తూపం వద్ద ఘనంగా ఎర్రజెండా ఎగరవేసిన అశ్వరావుపేట సిపిఐ నాయకులు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవ సందర్భంగా ఆదివారం సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ సయ్యద్ మీయాజాని స్థూపం వద్ద అశ్వారావుపేట సిపిఐ నాయుకులు ఘనంగా ఎర్రజెండా ఎగరవేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం ప్రసంగిస్తూ హైదరాబాద్ రాష్ట్ర నిజం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది భారతదేశంలో విలీనం కావడానికి ఆనాటి మహనీయులు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, కామ్రేడ్ ముగ్ధం మొహిద్దిన్, కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ల నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించిందని ఈ పోరాటంలో ఎందరో వీరులు వీర మరణం  పొందారని నాటి వీరుల చరిత్రను త్యాగాలను వారు ఆశించిన లక్ష్యాలను ఈనాటి తరానికి తెలియజేసి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి, ఎండి మున్నా, తనగల శివశంకర్, మహిళ సమైక్య నుంచి చీపుర్ల సత్యవతి, షేక్ దిల్, సరస్వతి, తనగల వరలక్ష్మి, ఏఐటీయూసీ నాయకులు తిర్నాతి, సత్యనారాయణ, కారు యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం నుంచి నాగేశ్వరరావు, సురేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: