మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచేరువు గ్రామంలో ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా ప్రాధన ఉపాద్యాయులు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా ఉపాధ్యాయులను సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందిచే ఉపాధ్యాయులు వృత్తిని చేపట్టి అహర్నిశలు శ్రమిస్తున్న గురువులందరకి మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాద్యాయులు అందరికీ ఉపాధ్యాయులు దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పులా మాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: