మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల ప్రకారం అశ్వాపురం టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కోర్శా దుర్గారావు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగిన గిరిజన సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మా గిరిజనుల పట్ల వారికి ఉన్న లోతైన అవగాహన ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదని చెప్పారు. మా గిరిజనులకు వారు పోడు భూములకు పట్టాలు ఇస్తామని 10 శాతం రిజర్వేషన్ను మరియు గిరిజన బంధు కేటాయించి మా గిరిజనులు పట్ల దైవం అని చెప్పడం జరిగింది. మా నియోజకవర్గంలో అభినవ కొమరం భీమ్ రేగ కాంతారావు కృషి కూడా మరువలేనిదని చెప్పారు. రాష్ట్రంలో మా గిరిజనులలో మా కుల గుర్తింపు రావడానికి కూడా రేగా కాంతారావు దేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో యువజన ప్రధాన కార్యదర్శి కోరెం రామారావు సర్పంచులు కుంజ రామారావు పాయం భద్రయ్య కల్లూరి లక్ష్మీనారాయణ బీసీ సెల్ మండల అధ్యక్షులు మామిళ్ళ కనిష్ కుమార్ యువజన నాయకులు పాండ్రు సతీష్ తాటి మోహన్ కృష్ణ కనితి రాంబాబు మడకం సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: