మన్యం టీవి, దుమ్ముగూడెం :: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను సమిష్టి కృషితో తిప్పి కొడదామని యువజన కాంగ్రెస్ నాయకులు కనుబుద్ధిదేవా హెచ్చరించారు. సోమవారం లక్ష్మీ నగరం లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు . నిరుపేదలైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రేషన్ కార్డులు వివిధ రకాల పింఛన్ల పై ప్రభుత్వ పట్టింపులేని వ్యవహారం మూలంగా నేటికి అర్హులకు ఆ ఫలాలు అందకుండా పోయాయి అని ఆయన విమర్శించారు. వరదల్లో అష్టకష్టాలు పడిన ప్రజానీకానికి వరద సహాయం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.2019 నుంచి ఆసరా పింఛన్లు మొదలు వికలాంగత్వం తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలన్నారు
Navigation
Post A Comment: