మన్యం టీవీ , దుమ్ముగూడెం : మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కల్లూరి నరసింహారావు రైతుకు చెందిన దుక్కి ఎద్దు పాము కాటు గురై మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. తాను వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఎద్దు ఒక్కసారిగా అస్వస్థకు గురై ఇబ్బందిగా ఉండడంతో గమనించిన రైతు పాముకాటుకు అయినట్టు పశు వైద్యశాల సిబ్బందికి సమాచారం అందించే లోపే మృతి చెందినట్లు తెలియజేశారు దీని విలువ సుమారు 30000 రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు
Navigation
Post A Comment: