CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇరిగేషన్ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు సమీక్ష సమావేశం

Share it:


మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు  మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ  సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,నియోజకవర్గం లోని పులుసు బొంత ప్రాజెక్ట్, వట్టి వాగు,లోటారి గండి, పినపాక,మణుగూరు,బూర్గంపాడు,అశ్వాపురం,మండలాలకు సంబంధించి గోదావరి నది ప్రవాహక ప్రాంత వరదలు, బ్యాక్ వాటర్,ముంపు ప్రాంతల గుర్తింపు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల కమిటీ  నియమించిందని,బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై సర్వే చేస్తున్నారని అన్నారు.అదేవిధంగా  చెరువులు,కాలువలు,చెక్ డ్యామ్ ల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులు,చెరువులు, కాలువల పనులు, చెక్ డ్యామ్ ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పరిశీలించి పనులలో పురోగతి అందించాలని విప్ రేగా కోరారు.ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ ఈ.వెంకటేశ్వర్ల రెడ్డి,ఏఈ సక్రు,మణుగూరు జడ్పీటిసి పోశం.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: