గుండాల సెప్టెంబర్ 9(మన్యం మనుగడ) : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రజా కవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ నాగ దివ్య కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ప్రతి ఏటా కాలోజి జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రజిని, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి, జూనియర్ అసిస్టెంట్ సురేష్ , అటెండర్ పాపారావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: