మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామి వారి నిమజ్జన కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తనయులు మెచ్చా రాము, రఘు, మేనల్లుడు తాటి ప్రదీప్ చంద్ర లు పాల్గొని సందడి చేశారు. తిరుమలకుంట గ్రామం విఘ్నేశ్వర యూత్, గణేష్ భక్తులతో కలిసి తీన్మార్ డప్పు శబ్దాలకు నృత్యం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ ఆ గణనాథుడు ఆశీస్సులతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలకుంట గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: