మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని టీ. కొత్తగూడెం, సుందరయ్య నగర్, భూపతిరావు పేట, గోదావరి పరివాహక ప్రాంతాలను మణుగూరు డీఎస్పీ కేవి.రాఘవేంద్రరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా, డీఎస్పీ రాఘవేంద్రరావు పడవ యజమానులతో మాట్లాడుతూ, ఎవరూ కూడ మావోయిస్టులకు సహకరించవద్దు అని సూచించారు. కొత్త వ్యక్తులు గోదావరి దాటినప్పడు, పోలీసులకు సమాచారం అందించాలని, మావోయిస్టులకు సహకరిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సి.ఐ రాజగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: