మన్యం మనుగడ, పినపాక : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర విలీన సమైక్య వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి కోరారు. బుధవారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
ఈ నెల 16, 17, 18వ తేదిలలో ప్రభుత్వం సంబరాలు ఘనంగా నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ నెల 16 వతేదిన పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరులో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి ప్రతి గ్రామ పంచాయితీకి 150 మందికి తగ్గకుండా హజరుకావాలన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు, అందరూ తప్పకహాజరుకావాలన్నారు. అదేవిధంగా 17వ తేదిన హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం, వజ్రోత్సవాల ముగింపు సభలను కూడా విజయవంతం చేయాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు భాధ్యత తీసుకొని కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి,సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, కొండేరు రాము,పోలిశెట్టి సత్తిబాబు,రాయల సత్యనారాయణ ,వడ్లకొండ శ్రీను,బెల్లకొండ చిన్నారి, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, కటకం గణేష్, సోంపల్లి తిరుపతి, ఎగ్గడి శ్రీరామ్ మూర్తి, కురికూరి శ్రీను,ఎంపీటీసీలు, కాయం శేఖర్, సర్పంచ్లు కోరం రజిని, బాడిష మహేష్, తోలెం కళ్యాణి, కృష్ణంరాజు, సునీల్, గొలుసుల నాగేశ్వరరావు, గుమ్మడి అశోక్, సుతారి నరేష్, ఉండం బాబూరావు, కొమరం నారాయణ, సాంబశివరావు, రాజు, పోతురాజు, బోడ ఈశ్వర్, బూర రమేష్, గుమ్మాసు శంకర్, రామకృష్ణ, రవి, శ్రీను, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: