మన్యం మనగడ సెప్టెంబర్ 20 వాజేడు. :
ఆదివాసీలకు కొమరం భీమ్ భవన్, లంబాడీలకు సేవాలాల్ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో నిర్మించారు. ఆదివాసీల జాతి గర్వపడేలా, ఆదివాసీల ఆత్మగౌరవం, ఆచార వ్యవహారాలను గౌరవించి కెసిఆర్ అద్భుతమైన నిర్మాణాలు చేసినందుకు వాజేడు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి పట్ల కెసిఆర్ దృష్టి పెట్టారు. ఏడు దశాబ్దాలుగా పాలక ప్రభుత్వాలు గిరిజనుల ఓట్లతో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొంది గిరిజనుల అభివృద్ధిని గాలికి వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ ప్రభుత్వంల గిరిజనులకు హైదరాబాద్ కేంద్రంగా గిరిజన భవనాలను నిర్మించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఆయన అన్నారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూసం, నరేష్ కుమార్ మాట్లాడుతూ కెసిఆర్ గిరిజన పక్షపాతి, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు, గిరిజన బంధు, ఇస్తామన్నారు. గిరిజనులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తానని అన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: