మన్యం టివి, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలను మణుగూరు జడ్పిటిసి పోశం. నరసింహారావు,ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ,బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణ వ్యాప్తంగా,ముఖ్యమంత్రి కేసీఆర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ నాగరాజు,ఎంపీడీవో వీరబాబు, ఎంపీటీసీలు కెవి రావు,కనితి బాబురావు,సర్పంచులు కారం ముత్తయ్య,కొమరం.జంపేశ్వరి, ఐ సి డి ఎస్ టీచర్లు, అధికారులు,ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post A Comment: