మన్యం మనుగడ, అశ్వారావుపేట: సోమవారం తెలంగాణ వీర మహిళా యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ అధ్యక్షురాలు మరియు అశ్వారావుపేట మండల అధ్యక్షురాలు ఎండీ రెహానా బేగం ఐలమ్మ పై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీపంలో వున్న సత్తుపల్లి పట్టణం లో వున్న ఆమె విగ్రహానికి ఘనంగా పూలమాలలు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ నిజాం పాలనలో ఒక సాధారణ మహిళగా దొరల గుండెల్లో ఉక్కు పాదం మోపిన పోరాట పటిమ ఆమె సొంతమని మహిళలు దొరలదోపిడీ పన్నులు మరియు వారికీ వెట్టి చాకిరీ చేస్తూ దాసి వ్యవస్థను కొనసాగిస్తున్న తరుణంలో వారి వెన్నులో వణుకు పుట్టించి ఎందరో మహిళల బానిసత్వ బ్రతుకులకు చరణ గీతం పడిన మహా యోధురాలు నేటి తరం ఆడపడుచులకు ఎందరికో ఆదర్శం ఆమె పోరాటామని కొనియాడారు. అలాగే ఆమె మాట్లాడుతూ మనకు స్వరాష్ట్రము ఏర్పడిన తెలంగాణలో ఆడబిడ్డ లకు రక్షణ లేదని నేటి సమాజంలో మనం దేవాలయాలుగా భావించే విద్యాలయాలలోనే ఆడబిడ్డలకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ఒక అగ్ని కణిక అని ఆమె పోరాట పటిమను గుర్తించి ప్రతి జిల్లా కేంద్రంలో వీర నారి ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ అధ్యక్షురాలు వేముల భారతి, మండల అధ్యక్షురాలు యండి రెహానా బేగం పలువురు పాల్గొని నివాళులు అర్పించారు.
Navigation
Post A Comment: