మన్యం మనుగడ కరకగూడెం: ఈనెల 14,15,16, తేదీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన క్రీడోత్సవాలలో భాగంగా కిన్నెరసాని లో నిర్వహించిన క్రీడల్లో భాగంగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల చిరుమళ్ళ (కరకగూడెం) విద్యార్థులు వరంగల్ లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. వాలీబాల్ అండర్ 17 విభాగంలో కె.అరవింద్ కుమార్,వి.రాజేష్,పి,సాయికుమార్,యం.అరుణ్ తేజ,అండర్ 14 విభాగంలో వి.నందు,పి.సూర్యనారాయణ, ఈ.శ్రీనాథ్, టి.అఖిల్,అండర్ 17 విభాగం చెస్ విభాగంలో యం.చుక్కరావు,అండర్ 14 ఖో-ఖో విభాగంలో వి.సుశాంత్ లు ఎన్నికైనారు.ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్,పిఈటి వట్టం.సంపత్ కుమార్ పిఈడి ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Navigation
Post A Comment: