దమ్మపేట(ములకలపల్లి ), మన్యం మనుగడ ప్రతినిధి:మండలం లోని మందలపల్లి గ్రామం లో జాతీయ వ్యవసాయ పరిశోధణ సంస్థ షేడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక 2022-23, భాంగంగా మందలపల్లి, గ్రామ రైతులకు వానపాముల ఎరువుల తయారీ - సాంకేతిక పరిజ్ఞాణం పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వానపాముల ఎరువుల తయారీ విధానము ఆవశ్యకత, మరియు వాటి లాభాలు క్షున్నంగా రైతులకు వివరించారు. అదేవిధంగా రైతులు వారు పండించే పంటలలో వచ్చే వివిధ సమస్యలను శాస్త్రవేత్తలతో చర్చించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల రైతులకు ఒక మోడల్ మొబైల్ వర్మి కిట్ ను 50 మంది రైతులకు 10 కేజీల చోప్పున కళాశాలలో తయారు చేసిన నాణ్యమైన వానపాముల ఎరువును అందించడం జరిగింది.అనంతరం స్థానిక గ్రామస్థులు ,కళాశాల యాజమాన్యనికి సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా కణాల అసోషియేట్ జీన్కళాశాల అశోషియేట్ జిన్. డాక్టర్ మాధవి,శిక్షణ సమన్వయ కర్త డాక్టర్ కాడ శిద్ధప్ప, డాక్టర్ యం.రాంప్రసాద్, కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ కే.నీలమ్మ , డాక్టర్ శివకుమార్ విద్యార్థిని, విద్యార్థులుగ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు .
Navigation
Post A Comment: