CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆసరా పెన్షన్ తో వృద్ధులకు భరోసా.....మండలానికి నూతనంగా 407 పెన్షన్స్ మంజూరు రేగా

Share it:


గుండాల సెప్టెంబర్ 1(మన్యం మనుగడ) :  తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ తో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఎంతో భరోసాని ఇస్తున్నామని ప్రభుత్వం విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్స్ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్స్ అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో 700 రూపాయలే పెన్షన్ ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రం వికలాంగులకు మూడు వేల రూపాయలు వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని అన్నారు. సంక్షేమంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకు పోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమంతా అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగదివ్య, ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీటీసీలు సంధాని, కృష్ణారావు, రాజేశ్వరి, సర్పంచ్ సీతారాములు, ప్రజా ప్రతినిధులు అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: