మన్యం మనుగడ ప్రతినిధి:
హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దృష్టికి పినపాక నియోజకవర్గం పరిధిలోని పలు సమస్యల గురించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఇతర అంశాల గురించి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ తో చర్చించారు. అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని త్వరలోనే అధిక నిధులు మంజూరు చేస్తారని ఆయన తెలిపారు, ప్రధాన సమస్యగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు, రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే ఆదివాసి గిరిజన ప్రాంత ప్రజల పోడు పరిష్కారానికి సీఎం కేసీఆర్ గారు నూతనంగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 140 విడుదల చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్ కి ఆదివాసి గిరిజన ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Post A Comment: